- అని సమాధానం ఇచ్చిన సిబ్బంది
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి రెస్టారెంట్లో బిర్యానీ పార్సిల్ తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. దాన్ని తింటుండగా చనిపోయిన ఈగ బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. రాంనగర్కు చెందిన రవి శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బావర్చిలో రూ. 350 చెల్లించి.. చికెన్ ఫుల్బిర్యానీ, మినీ మటన్ బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్లాడు. మటన్ బిర్యానీ ఓపెన్ చేసి కుటుంబసభ్యులతో కలిసి తింటుండగా.. అందులో చనిపోయిన ఈగ బయటపడింది. ఆ పార్సిల్ను రవి తిరిగి బావర్చి రెస్టారెంట్ కు తీసుకెళ్లి అక్కడి సిబ్బందికి చూపించాడు. కౌంటర్లో ఉన్న సిబ్బంది ‘మిస్టేక్లో వచ్చింది.. ’ అని చెప్తూ మరో బిర్యానీ ప్యాకెట్ఇవ్వడానికి ప్రయత్నించాడు.
మీ బిర్యానీ అక్కర్లేదు.. ఎందుకు ఇట్ల వచ్చింది. అసలే వానాకాలం. ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యులు’ అని రవి ప్రశ్నించాడు. సార్.. మిస్టేక్లో వచ్చి ఉంటుంది.. మరో ప్యాకెట్ తీసుకోండి’ అంటూ దాట వేయడానికి ప్రయత్నించాడు. దీనిపై ముషీరాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ బావర్చి బిర్యానీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.
ఆ మధ్య ఫుడ్లో బల్లి వచ్చిందని స్థానిక కార్పొరేటర్ ఆందోళనకు కూడా దిగారు. బావర్చిలో బిర్యానీ కొంటే ఈగ వచ్చింద ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని జీహెచ్ఎంసీ గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. శాంపిల్ను తీసుకుని ల్యాబ్కు పంపుతామన్నారు. ఆ తర్వాత విచారణ జరిపి షోకాజ్ నోటీసు జారీచేస్తామని ఆయన చెప్పారు. ఫుడ్ క్వాలిటీ నాసిరకంగా ఉన్నట్లైతే రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.