![వాహనం ఢీకొని చిరుతపులి మృతి](https://static.v6velugu.com/uploads/2023/02/tiger_jcSKXlCyQ8.jpg)
నిజామాబాద్ జిల్లా : ఇందలవాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామంలోని NH 44 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. మృతిచెందిన చిరుతపులిని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఈ ఘటన సుమారు నిన్న రాత్రి 11 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు చెబుతున్నారు.