మద్యం మత్తులో కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌ బీభత్సం

మద్యం మత్తులో  కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌ బీభత్సం

ఆరేండ్ల పాపకు గాయాలు 

కూకట్​పల్లి, వెలుగు: మద్యం మత్తులో ఓవర్​ స్పీడ్​గా కారు నడిపిన వ్యక్తి ముందు వెళుతున్న కారును ఢీకొట్టడంతో ఆరేండ్ల బాలిక గాయపడింది.  నిందితుడు కారుతో పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  కూకట్‌‌‌‌పల్లి కమలా ప్రసన్ననగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే రుగ్వేద్​భార్య, పిల్లలతో కలిసి కారులో వరంగల్​నుంచి బయలుదేరి కూకట్​పల్లి వస్తున్నాడు. శనివారం రాత్రి 12.30 సమయంలో వీరి కారు వివేకానందనగర్​లోని అభి టిఫిన్​సెంటర్​వద్దకు రాగానే, వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో రుగ్వేద్​ కూతురుకి స్వల్పంగా గాయపడింది. ప్రమాదానికి కారణమైన ఆనంద్​(35)పై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.