తాగిన మత్తులో.. మందనుకొని యాసిడ్​ తాగిండు

తాగిన మత్తులో..  మందనుకొని  యాసిడ్​ తాగిండు

చందానగర్​, వెలుగు: తాగిన మత్తులో బాత్​రూంలోని యాసిడ్​తాగి ఓ వ్యక్తి చనిపోయాడు. చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు.. వేంకుంట ప్రాంతంలో టి.లక్ష్మణ్ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు.మాదాపూర్​లోని ఓ కారు సర్వీసింగ్​ సెంటర్​లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో మద్యం మత్తులో  ఉన్న లక్ష్మణ్​ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్​ను మందు అనుకొని తాగేసాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో లక్ష్మణ్​ మృతి చెందాడు.

A man drinks acid while intoxicated