
- బిల్డింగ్పై నుంచి పడి తీవ్ర గాయాలు
- చికిత్స పొందుతూ చనిపోగా.. అవయవదానం
- శుక్రవారం సొంతూరిలో అంత్యక్రియలు పూర్తి
సదాశివనగర్, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన బండ కిందిపల్లె సురేశ్(35), ఈనెల 2న దుబాయ్వెళ్లాడు. 4వ తేదీ నుంచి బిల్డింగ్ నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. 9న పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్పైనుంచి కిందడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల16న చనిపోయినట్టు మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.
కుటుంబ సభ్యుల అభ్యర్థనతో సురేశ్అవయవాలు దానం చేశారు. శుక్రవారం సొంతూరుకు డెడ్ బాడీని పంపించగా.. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడికి భార్య కావ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.