అత్తను హోటల్కు రమ్మన్న అల్లుడు
అత్త ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు కొంతమంది. తాజాగా ఓ అల్లుడు అత్తను హోటల్కు రమ్మంటూ వేధించాడు. అత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబైకి చెందిన 45 ఏళ్ల మహిళ బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆ మహిళకు చెందిన బంధువొకరు ఆదివారం చనిపోయారు. ఆమె ఆ అంత్యక్రియలకు హాజరైంది. అయితే ఇదే అంత్యక్రియలకు వారి దూరపు బంధువు పూణే నుంచి వచ్చాడు. పూణే నుంచి వచ్చిన వ్యక్తి బ్యూటీషియన్కు వరుసకు అల్లుడవుతాడు. అయితే అంత్యక్రియల కార్యక్రమంలో ఈ వ్యక్తి.. బ్యూటీషియన్ను అనుచితంగా తాకాడు. ఇది అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత తాను పూణేలోని హోటళ్లో రూం బుక్ చేశానని.. నువ్వు రావాలంటూ ఆమెకు మెసెజ్ చేశాడు. అతని మెసెజ్కు విసుగుచెందిన బ్యూటీషియన్.. మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఆ వ్యక్తి తనను హోటల్కు రావాలంటూ వేధిస్తున్నాడని.. అంత్యక్రియల సమయంలో కూడా అశ్లీలంగా సైగ చేశాడని బ్యూటీషియన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పూణేలో అరెస్టు చేశారు.
For More News..