మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఒకరి మృతి

మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఒకరి మృతి

కూసుమంచి, వెలుగు : మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం శివారులో ఆదివారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన బిక్షం(49) అనే వ్యక్తి ఫ్రెండ్స్​తో కలిసి మేడారం జాతరకు బయలు దేరాడు. 

నాలుగు బైకులపై ఎనిమిది మంది హుజూర్ నగర్ నుంచి వస్తున్నారు. ఈశ్వరమాధారం వద్దకు రాగానే బిక్షం గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.