![అభ్యర్థుల ఖర్చులను నమోదు చేయాలి : సంజీబ్ కుమార్ పాల్](https://static.v6velugu.com/uploads/2023/11/ollectorate-with-the-nodal-officers-of-election-conduct_dDelboYF1c.jpg)
- ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఎక్సైజ్ ఇన్కం ట్యాక్స్, ఎన్నికల ప్రవర్తనా నియామవళి నోడల్ఆఫీసర్లతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు
సమావేశాలన్నింటిని వీడియో సర్వే లైన్స్ టీం సభ్యులు రికార్డ్ చేయాలని ఆయన చెప్పారు. వీడియో పరిశీంచి వివరాలను అకౌంటింగ్ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఒకరు పర్మిషన్ తీసుకున్న వెహికల్ను వేరు అభ్యర్థి ఉపయోగించరాదన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలన నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, ఆఫీసర్లు రుక్మిణి, జానయ్య, సింధు పాల్గొన్నారు.