రెండేళ్ల కొడుకుతో కలిసి తల్లి సూసైడ్..అత్తామామ వేధింపులే కారణం.. మెదక్ జిల్లాలో ఘటన

రెండేళ్ల కొడుకుతో కలిసి తల్లి సూసైడ్..అత్తామామ వేధింపులే కారణం.. మెదక్ జిల్లాలో ఘటన

చిన్నశంకరంపేట, వెలుగు: అత్తామామ వేధింపులు తాళలేక ఓ వివాహిత తన రెండేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల అఖిల(23) భర్త ప్రవీణ్​గౌడ్​ ఏడు నెలల క్రితం మృతిచెందాడు. ఆమెకు రెండేళ్ల కొడుకు రియాన్ష్ గౌడ్ ఉన్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి అత్తామామలు అఖిలను పుట్టింటికి వెళ్లిపోవాలని, రియాన్ష్​ను తమ వద్దే ఉంచాలని ఒత్తిడి తెస్తున్నారు. 

దీంతో కొద్ది రోజుల క్రితం అఖిల సంకాపూర్​లోని తల్లిగారింటికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఖాజాపూర్ గ్రామంలోని అత్తవారింటికి వచ్చింది. అయినా అత్తామామల నుంచి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం కొడుకు రియాన్స్​కు ఉరి వేసి చంపి, వెంటనే తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఫిర్యాదుతో అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు.