కన్జూమర్ టెక్ సంస్థ ఉడ్ఛలో, ఎలక్ట్రిక్ సైకిల్ ‘వీర్ బైక్’ ను లాంచ్ చేసింది. ఐపీ 65, 67 రేటింగ్స్, లైట్ వెయిట్ ఫ్రేమ్, డిస్క్ బ్రేక్, అడ్జస్టబుల్ సీట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వీర్ బైక్ ధర రూ. 25,995 నుంచి ప్రారంభం అవుతోంది. సాయుధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది. రెగ్యులర్ కస్టమర్లు అయితే రూ. 27,995 చెల్లించాలి. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు.
