చెట్ల పొదల్లో ఆడ శిశువు..స్థానికుల సమాచారంలో ఆసుపత్రికి తరలింపు

చెట్ల పొదల్లో ఆడ శిశువు..స్థానికుల సమాచారంలో  ఆసుపత్రికి తరలింపు

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పాత్రపురం పంచాయితీ రైతు వేదిక సమీపంలోని పొదల్లో సాయంత్రం 5 గంటల సమయంలో పసిగుడ్డు ఏడుపు గ్రామస్తులకు వినిపించింది. దీంతో అక్కడికెళ్లిన గ్రామస్తులకు పొదల్లో నవజాత శిశువు కనిపించింది. పాపకి ఒంటినిండా రక్తం కారుతున్నది. ఎర్ర చీమలు పట్టి ఉన్నాయి.  దీంతో స్థానికులు వెంటనే వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ కి సమాచారం అందజేశారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లిన హుస్సేన్.. పోలీసులకు సమాచారం అందజేసి శిశువును వెంకటాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాపకు డాక్టర్  యుధిష్టిర్  వైద్య పరీక్షలు నిర్వహించారు. శిశవు క్షేమంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెంకటాపురం ఎస్సై తెలిపారు. శిశువును వరంగల్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.