ఎంబీబీఎస్ సీట్లపై హైకోర్టులో పిటిషన్

ఎంబీబీఎస్ సీట్లపై హైకోర్టులో పిటిషన్
  • తెలంగాణ నిర్ణయంతో ఏపీ స్టూడెంట్లు నష్టపోతారని పిల్

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్‌‌ కన్వీనర్‌‌ కోటా సీట్లను ఏపీకి చెందిన స్టూడెంట్లకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలైంది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వ తరఫు అదనపు ఏజీ కోరగా, విచారణను బుధవారం చేపడతామని కోర్టు తెలిపింది. 

తెలంగాణ నిర్ణయంతో ఏపీ స్టూడెంట్లు నష్టపోతారని పేర్కొంటూ, తమ పిటిషన్​ను విచారణ చేయాలని ఏపీకి చెందిన స్టూడెంట్ మంగళవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​ను కోర్టు విచారించింది. వెద్య కళాశాలల్లో కాంపిటేటివ్‌‌ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌‌ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన జీవో 72ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.