
న్యూఢిల్లీ: మనదేశం మరికొన్ని రోజుల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ స్టార్టప్ల సంఖ్య 75 వేలకు పెరిగిందని కేంద్రమంత్రి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ బుధవారం ప్రకటించారు. మన విజన్ ఏంటో, పవర్ ఏంటో ఈ సంఖ్యలు చెబుతున్నాయని ట్వీట్ చేశారు.
ఇన్నొవేషన్, ఎంటర్ప్రైజెస్ డ్రైవ్ గ్రోత్కు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోందని చెప్పారు. త్వరలోనే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదుగుతుందని ఆశాభావం ప్రకటించారు. స్టార్టప్లు విదేశాలకు బదులు ఇండియా మార్కెట్లలోనే లిస్ట్ కావాలని, కొన్ని అదనపు డాలర్ల కోసం బిజినెస్ను సొంత దేశం నుంచి తరలించొద్దని సూచించారు.