శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం..అదుపుతప్పిన కారు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం..అదుపుతప్పిన కారు

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన పర్యాటకుల కారు.. డ్యామ్ ఘాట్ రోడ్డు పై నుండి కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

నిర్మల్ కు చెందిన నలుగురు యువకులు ఎస్సారెస్పీ డ్యామ్ సందర్శనకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు అదుపు తప్పి.. డ్యామ్ ఘాట్ రోడ్డు పై నుండి కిందికి పడిపోయినట్లు సమాచారం అందుతోంది. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు  చేస్తున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.