న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రెండు వారాల్లో ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. తొలి వారంతో పోలిస్తే.. రెండో వారంలో రాజ్యసభ కార్యకలాపాలు మరింత తగ్గాయి. తొలి వారం 27% సభ జరిగితే.. రెండో వారంలో అది 16 శాతానికి పడిపోయింది. మొత్తంగా రెండు వారాలను కలిపితే సభ జరిగింది 21.58 శాతం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా పది రోజులు సభ జరిగితే 11 గంటల 8 నిమిషాలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగాయి. వాస్తవానికి 51 గంటల 35 నిమిషాలు జరగాలి.
ప్రతిపక్షాల ఆందోళనలతో 40 గంటల 45 నిమిషాలు వృథా అయ్యింది. ఎటువంటి చర్చా జరగకపోవడంతో ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు, అగ్నిపథ్ స్కీమ్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలుత ధరల పెరుగుదల.. తర్వాత అగ్నిపథ్
పార్లమెంట్లో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్షాలు ఈ వారం కూడా తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నాయి. ఒకవేళ ఉభయసభల్లో ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం చర్చ చేపడితే.. ఆ తర్వాత అగ్నిపథ్ స్కీముపై చర్చకు
పట్టుబట్టాలని భావిస్తోంది.