దేశంలో చాలా చోట్ల ఇప్పటికీ వడగాలులు వీస్తున్నాయి. వీటి వల్ల ప్రజలే కాదు, పశు పక్ష్యాదులు కూడా దాహంతో అల్లడిపోతుంటాయి. అలాంటిది ఓ బాలుడు పావురాల దాహం తీర్చడానికి చేసిన పని తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో చిన్న పిల్లవాడు ట్యాంక్ నుంచి నీటి సీసాను నింపి పక్షుల కోసం ఉంచిన కంటైనర్లో జాగ్రత్తగా పోస్తున్నట్లు కనిపిస్తోంది.
కల్మషం లేని పసి మనసు మూగ జీవాల కోసం పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు ఆ బుడ్డోడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పెద్ద వారికీ బాలుడు స్ఫూర్తిగా నిలిచాడని కామెంట్లు చేస్తున్నారు. ఒక్కోసారి చిన్న పిల్లలు వారు చేసే పనులతో పెద్దవారిని ఆలోచనలో పడేస్తారు. వారి పనులతో స్ఫూర్తి నింపుతారు. ఇలాంటిదే ఆ బాలుడు చేసి షెభాష్అనిపించుకున్నాడు.