హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కేసీఆర్కు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేక బస్సును తెప్పించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ ఈ బస్సును సమకూర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బస్సుపైన ‘భారత రాష్ట్ర సమితి’ అని రాసి.. ఎడమ వైపున కారు గుర్తు, కుడి వైపున కేసీఆర్ ఫొటో ముద్రించారు. బస్సు అద్దం కింద ‘తెలంగాణ ప్రగతి రథం’ అని రాశారు. ఉత్తర ప్రదేశ్లోనే ఈ బస్సు రిజిస్ట్రేషన్ చేయించారు.
‘‘యూపీ 32 జీఎం 1990” నంబర్ ఉన్న ఈ బస్సును సిక్కు డ్రైవర్ నడిపించారు. ఆదివారం ఈ బస్సులోనే హైదరాబాద్ నుంచి కేసీఆర్ హుస్నాబాద్కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంది. అభ్యర్థులతో సమావేశం, బీఫామ్లు అందజేత, ప్రెస్మీట్, ఇతర కార్యక్రమాలతో ఆలస్యం కావడంతో హెలికాప్టర్లో కేసీఆర్ హుస్నాబాద్కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునేసరికే కొత్త బస్సును అక్కడ హెలిప్యాడ్ వద్ద రెడీగా ఉంచారు. అదే బస్సులో మంత్రి హరీశ్రావు, ఇతర నాయకులతో కలిసి కేసీఆర్ సభ వేదిక వద్దకు వచ్చారు. సోమవారం నుంచి జరిగే ప్రచార సభల్లోనూ ఇదే బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు.