వాషింగ్టన్: హెచ్ఐవీ (ఎయిడ్స్) కన్నా కరోనా వైరస్ ఎన్నెన్నో రూపాలు మార్చిందని ఇంతకుముందు సైంటిస్టులు చెప్పారు. అయితే, అనుకున్నన్ని మ్యుటేషన్లేమీ జరగలేదని తాజాగా సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్కు ఎలాంటి ఢోకా ఉండబోదని భరోసా ఇస్తున్నారు. అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్టులు 84 దేశాలకు చెందిన 27 వేల మందిపై స్టడీ చేసి ఈ విషయాన్ని చెప్పారు.వాళ్ల నుంచి తీసుకున్న 18,514 వైరస్ జీనోమ్లను సీక్వెన్స్ చేసి.. పెద్దగా మ్యుటేషన్లు లేవని తేల్చారు. వుహాన్లో మహమ్మారి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ జీన్స్లలో మార్పులు జరిగింది చాలా తక్కువన్నారు. మనిషిలోకి ఎంటరైన తర్వాత కన్నా కూడా.. ముందే ఆ వైరస్ జీన్స్లో మార్పులు వచ్చినట్టు గుర్తించారు.
ముందు నుంచి చెబుతున్నట్టు వైరస్ స్పైక్లో ‘డీ614జీ’ మ్యుటేషన్లు జరుగుతున్నా.. మనుషుల్లో ఎంటరయ్యాక మాత్రం జరగట్లేదని స్టడీలో పాల్గొన్న వాల్టర్ రీడ్ సైంటిస్ట్ మోర్గాన్ రోలండ్ చెప్పారు. వేర్వేరు స్ట్రెయిన్లకు చెందిన జీన్స్ను లింక్ చేయడం చాలా కష్టమైన పని అన్నారు. అయితే, డీ614జీ మ్యుటేషన్పై మరింత స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కరోనాకు తయారవుతున్న వ్యాక్సిన్ ఏదైనా సరే బాగానే పనిచేస్తుందన్నారు. స్ట్రెయిన్ ఏదైనా వ్యాక్సిన్ పనితీరు మెరుగ్గా ఉంటుందన్నారు. హెచ్ఐవీ, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూతో పోలిస్తే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. కాగా, ఇండియా సహా ఆరు దేశాల్లో గర్భిణులపై కరోనా ప్రభావాన్ని తెలుసుకునేందుకు అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టడీ చేయనుంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, కెన్యా, జాంబియా, కాంగో, గ్వాటెమాలాల్లో స్టడీ చేయనుంది. గర్భం టైంలో, పిల్లలు పుట్టాక ఏడాది వరకు వారిపై కరోనా ప్రభావం ఎంత ఉంటుందో తేల్చనున్నారు సైంటిస్టులు.