పుణె : మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్పాటిల్పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో చంద్రకాంత్పాటిల్ పర్యటనలో ఈ ఘటన జరిగింది. డా.బీఆర్అంబేడ్కర్, జ్యోతిరావు పూలేపై చంద్రకాంత్పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిపై దుండగుడు సిరా చల్లిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేడ్కర్, పూలే ప్రభుత్వ నిధులను కోరలేదని, పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు ‘అడుక్కోవాలి’ అని చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. అయితే.. అడుక్కోమనడం అనే వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని చెప్పడం మంత్రి ఉద్దేశమని వివరణ ఇచ్చారు.