కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతి..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ టౌన్ లో ఘటన

కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతి..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ టౌన్ లో ఘటన

తొర్రూరు, వెలుగు: విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. తొర్రూరు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఓరుగంటి శైలజ(35) మున్సిపల్ ఆఫీస్ వద్ద ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. 

మంగళవారం బట్టలు ఉతికి ఇనుప తీగ(దండం) పై ఆరేస్తుంది. ఆ ఇనుప తీగకు కరెంటు తీగ అనుకుని ఉండగా.. ప్రమాదవశాత్తు తగలడంతో షాక్ కొట్టి ఆమె స్పాట్ లో చనిపోయిఇంది. ప్రమాదానికి కారణమైన ఇంటి యజమానిపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని మృతదేహంతో  మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. మృతురాలికి భర్త వీరేశ్, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో కన్నీరు మున్నీరుగా విలపించారు.   భర్త వీరేశ్​ ఫిర్యాదుతో విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాంజీ నాయక్ తెలిపారు.