ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది

ఫేస్ బుక్  ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది
  • పిస్టల్ అమ్మేందుకు యత్నిస్తున్న యువకుడు అరెస్ట్  

జీడిమెట్ల, వెలుగు : పిస్టల్​అమ్మేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని బాలానగర్​ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్​పరిధి అయోధ్యనగర్​కు చెందిన గుడ్డి వంశీకృష్ణ గౌడ్ (21)​లిఫ్ట్​టెక్నీషియన్. అతనికి మధ్య ప్రదేశ్ కు చెందిన విశాల్​యాదవ్​ఫేస్​బుక్​లో ఫ్రెండ్ గా పరిచయం అయ్యాడు. ఏడాదిగా వీరు ఫోన్​లో మాట్లాడుకుంటుండగా.. విశాల్ తను ఆయుధాలు సప్లై చేస్తుంటానని, వాటిని హైదరాబాద్​లో అమ్మితే  భారీగా డబ్బు సంపాదించవచ్చని సూచించాడు.

దీంతో వంశీ కృష్ణ​ఈజీమనీకి ఆశపడి ఆయుధాలు అమ్మేందుకు ఒప్పుకున్నాడు. ఒక పిస్టల్ ను​రూ.50వేలకు విశాల్​ వద్ద కొనుగోలు చేసేందుకు వంశీకృష్ణ రూ.19వేలు ఫోన్​పే ద్వారా చెల్లించాడు. గత మార్చి 6న ​విశాల్ ఖాజీపేట్​కు వచ్చి పిస్టల్ ​తెచ్చానని చెప్పాడు. వంశీ కృష్ణ తన బైక్​పై వెళ్లి రూ.30వేలు చెల్లించి మూడు లైవ్​రౌండ్ల పిస్టల్​తీసుకుని సిటీకి వచ్చాడు. తెచ్చిన పిస్టల్​ను రూ.2లక్షలకు,  ఒక తూటా రూ.8వేలకు చొప్పున సిటీలో అమ్మేందుకు వంశీకృష్ణ ప్రయత్నిస్తున్నాడు.

బుధవారం రాత్రి చింతల్ వద్ద బాలానగర్​ పోలీసుల చెకింగ్ ల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వంశీకృష్ణ​వద్ద మూడు రౌండ్ల పిస్టల్​ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఏమైనా ఆయుధాలు విక్రయించాడా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.