అండర్​19 టీంలో పోతుగల్​ యువకుడు

అండర్​19 టీంలో పోతుగల్​ యువకుడు
  •  వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన అవినాష్‌‌‌‌‌‌‌‌రావు
  •     బ్యాట్స్ మెన్, కీపర్ గా ఇండియా టీంలో ప్లేస్‌‌‌‌‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు: అండర్–19 క్రికెట్​వరల్డ్​కప్​ టీంకు రాజన్నసిరిసిల్ల జిల్లా యువకుడు ఎంపికయ్యాడు. ముస్తాబాద్​మండలం పోతుగల్​ గ్రామానికి చెందిన అవినాష్‌‌‌‌‌‌‌‌రావు వికెట్​కీపర్​, బ్యాటర్​గా ఇండియా జట్టుకు సెలెక్ట్​ అయ్యాడు. అవినాష్​ తండ్రి లక్ష్మణ్​ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్​ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. క్రికెట్​ మీద ఇష్టంతో అవినాష్​ 9 ఏండ్ల నుంచే క్రికెట్​ సాధన మొదలుపెట్టాడు. కొడుకు ఇష్టాన్ని గమనించిన లక్ష్మణ్​ హైదరాబాద్​ క్రికెట్​అసోసియేషన్‌‌‌‌‌‌‌‌లో చేర్పించాడు.

బాగా కష్టపడిన అతను అండర్–14,  అండర్​–16 విభాగాల్లో హైదరాబాద్​జట్టుకు సెలెక్ట్​ అయ్యాడు. అక్కడ సత్తా చాటి చాలెంజర్స్​ టోర్నీకి ఎంపికయ్యాడు. అనంతరం అండర్–​19 ఏ టీంకు సెలక్ట్​అయి బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వికెట్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాణించాడు. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన అవినాష్​ అండర్–19 టీంలో ప్లేస్ ​సంపాదించాడు. ప్రస్తుతం దుబాయ్​లో జరుగుతున్న ఆసియాకప్ ఆడుతున్నాడు. అనంతరం డిసెంబర్​19 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న  ట్రై సిరీస్, ఆ తర్వాత జనవరి 19న అక్కడే జరిగే వరల్డ్​కప్​పోటీల్లో ఇండియా తరఫున ఆడనున్నాడు.

తన కొడుకు ఇండియా జట్టుకు ఎంపికకావడంపై తండ్రి లక్ష్మణ్​రావు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తన కొడుకు ఇండియా సీనియర్​ టీంకు ఆడాలని ఆకాంక్షించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన అవినాష్ అండర్​19 టీంకు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచాడని అభినందిస్తున్నారు.