PPE కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం భారీగా అక్రమాలు

PPE కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం భారీగా అక్రమాలు

PPE కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ భారీగా అక్రమాలు చేశారని ఆరోపించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన భార్య కంపెనీకి,  కొడుకు వ్యాపారాల్లో భాగస్వాములకు అధిక ధరలకు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. ఇతర సంస్థల నుంచి 600 రూపాయలకు కొంటూ.. భార్య, కొడుకుకు చెందిన కంపెనీలకు ఒక్కో పీపీఈ కిట్ కు 990 రూపాయలు చెల్లించారన్నారు సిసోడియా. అయితే.. వాళ్లు పీపీఈ కిట్లు పూర్తిస్థాయిలో సప్లై చేయకుండా ఆ తర్వాత మళ్లీ కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపించారు. రెండోసారి కాంట్రాక్టు ఇచ్చినప్పుడు పీపీఈ  కిట్ రేటు 12 రూపాయలు దాటిపోయిందన్నారు. అపోజిషన్ పార్టీలపై అక్రమంగా కేసులు పెట్టే బీజేపీ సర్కారు..తమ పార్టీ నేతలు తప్పు చేశారనే ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.