నేటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్

నేటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రుల నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ పథకం కింద రావాల్సిన రూ. 1500 కోట్ల బకాయిలను ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చెల్లించడం లేదని వారు తెలిపారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పారు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అనివార్య పరిస్థితుల్లో, మరో మార్గం లేకనే ఆసుపత్రుల యాజమాన్యాలు సమష్టిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.