మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ.. సంపదను బడా వ్యాపారులకు దోచిపెడుతోంది

మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ.. సంపదను బడా వ్యాపారులకు దోచిపెడుతోంది

వనపర్తి, వెలుగు :  ఆర్ఎస్ఎస్, బీజేపీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజ్యమేలుతున్నాయని సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు  విమర్శించారు.  ఆదివారం పార్టీ జిల్లా ఆఫీస్​లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  ఇన్నేండ్లుగా దేశం సాధించుకున్న సంపదను కార్పొరేట్ బడా వ్యాపారులకు బీజేపీ  దోచిపెడుతోందని ఆరోపించారు. స్థానిక ప్రజా సమస్యలపై జూన్ నుంచి ఆగస్టు వరకు క్యాంపియన్   నిర్వహిస్తామని తెలిపారు.