
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో దూసుకెళుతోంది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లో నటిస్తున్న ఆమె.. తాజాగా రవితేజ సినిమాలోనూ ఛాన్స్ అందుకున్నట్టు సమాచారం. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉంది. ఈ పాత్రలకు తొలుత కయాదు లోహర్, మమిత బైజు పేర్లు వినిపించినప్పటికీ వాళ్లిద్దరూ ఫైనల్ అవలేదు.
ఇటీవల కేతిక శర్మను ఓ హీరోయిన్గా తీసుకున్నట్టు సమాచారం. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు ఆషిక రంగనాథ్ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కిషోర్ తిరుమల గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ హీరోయిన్ పాత్రలకు అధిక ప్రాధాన్యత ఉండబోతోంది. జూన్ లేదా జులైలో ఈ సినిమా సెట్స్కు వెళ్లబోతోంది. ఇక కళ్యాణ్రామ్కు జంటగా ‘అమిగోస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్.. ఆ తర్వాత నాగార్జునకు జంటగా ‘నా సామిరంగ’తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో మెరవబోతోంది.