
ఖైరతాబాద్, వెలుగు : సీనియర్ జర్నలిస్ట్ఏబీకే ప్రసాద్ వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారు సంజయ్బారు పేర్కొన్నారు. జీవితాంతం జర్నలిజంను నమ్ముకుని ఎందరినో ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏబీకే ప్రసాద్90వ పుట్టినరోజు సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏబీకే ప్రసాద్జీవన సాఫల్య అభినందన సభ నిర్వహించారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో ‘అలుపెరుగని అక్షరాయుధుడు’ అనే పుస్తకం ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ ప్రెస్అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఏ కొత్త పత్రిక వచ్చినా అది ఏబీకే సారథ్యంలోనే విడుదలైందని తెలిపారు. ఆయనకు శిష్యుడిగా తనకు చాన్స్ రాలేదని చెప్పారు. తనకు ఏబీకే ప్రసాద్మంచి బ్రేక్ ఇచ్చారని, సీనియర్ జర్నలిస్ట్కె.రామచంద్రమూర్తి గుర్తుచేశారు. జర్నలిజానికి స్టార్డమ్ తెచ్చింది ఏబీకే ప్రసాద్అని ఆంధ్రజ్యోతి ఎడిటర్కె.శ్రీనివాస్పేర్కొన్నారు.
తెలుగును అధికార భాషగా ప్రకటించడంలో సంజయ్బారు పాత్ర గొప్పదని ఏబీకే ప్రసాద్ అన్నారు. దాసు కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.