317 జీవోను రద్దు చేసి న్యాయం చేయండి

317 జీవోను రద్దు చేసి న్యాయం చేయండి
  •     నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు 

ఖైరతాబాద్,వెలుగు : బీఆర్ఎస్​ హయాంలో తీసుకొచ్చిన 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయామని బాధిత నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.  జీవో అమలుతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విధులకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో బాధితులు రాపోలు శేఖర్​, మమత, కిరణ్​కుమార్,మంజుల మాట్లాడుతూ..

జాబ్ ఇచ్చింది భువనగిరిలో అయితే.. 317 జీవో అమలుతో జోగులాంబ గద్వాల్​ జిల్లాకు పంపారని పేర్కొన్నారు.  ఇలా అన్యాయం జరిగిందని, ఈ జీవోను రద్దు చేసినా లేకుంటే.. సవరణ అయినా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు తమను పాత స్థానిక తీసుకొచ్చి తమను ఆదుకోవాలని వారు కోరారు.

ALSO READ: కనీస వేతనాల అమలు జరిగేనా?