
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఘటన
- దాడికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామ శివారులో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆదిత్య గురువారం రాత్రి గ్రామ శివారులో మూత్ర విసర్జన చేస్తుండగా ముసుగు ధరించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కడుపులో పొడిచి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఆదిత్యను హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా.. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు.
ఆపరేషన్ కగార్కు మద్దతు పలుకుతూ మూడు రోజుల కింద ర్యాలీ నిర్వహించడం వల్లే దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆదిత్యపై దాడిని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు శుక్రవారం హుస్నాబాద్లో ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆపరేషన్ కగార్కు మద్దతుగా ర్యాలీ తీసినందునే కమ్యూనిస్ట్ భావాజాలాలున్న వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఆరోపించారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు, కమ్యూనిస్టులు ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు.