ఆమనగల్లులో త్వరలో ఏసీబీ కార్యాలయం

ఆమనగల్లులో త్వరలో ఏసీబీ కార్యాలయం

ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లులో ఏసీబీ ఆఫీసు ఏర్పాటు ప్రతిపాదనలో ఉందని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను డీసీపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం అతి తక్కువ క్రైమ్ రేటు నమోదైందన్నారు.  జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపడతామని చెప్పారు.  సమావేశంలో షాద్ గర్ ఏసీపీ రంగస్వామి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం పాల్గొన్నారు .