సీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..43 లక్షల అక్రమాస్తులు గుర్తింపు

సీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..43 లక్షల అక్రమాస్తులు గుర్తింపు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 43 లక్షల 54 వేల రూపాయల అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
 
9 లక్షల 12 వేల రూపాయల విలువ చేసే  బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కామారెడ్డి సీఐగా పనిచేసిన జగదీష్.. 2020 లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రెండేళ్లుగా జగదీష్ సస్పెన్షన్లో ఉన్నారు.