తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లపై ఏసీబీ రైడ్​

తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లపై ఏసీబీ రైడ్​

కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరులో గురువారం తెల్లవారుజాము వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా వారిపై ఏసీబీ రైడ్​చేసింది. ఈ సందర్భంగా అధికారులు లెక్క చూపని రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని తిరువూరు క్రాస్ రోడ్‌లో మూడు రోజులుగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది జీఎస్టీ ట్కాక్స్​పేరుతో వాహనాలు తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో వారు నిఘా పెట్టి ఈ దాడులు చేశారు.

ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఏసీపీవో -శ్రీరామ్, సిబ్బంది దగ్గర రూ.10 వేలు దొరకగా సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. సెల్ ఫోన్లు, రికార్డులను స్వాధీనం చేసుకొని  ఏసీపీవో, సిబ్బందిని ఖమ్మం ఏసీబీ ఆఫీసుకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్​పీ వై. రమేశ్​తెలిపారు.