సలాబత్ పూర్ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు

 సలాబత్ పూర్ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు
  •  ప్రైవేటు వ్యక్తులే ఆఫీసు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు
  • వారి వద్ద నుంచి రూ. 91 000 స్వాధీనం

పిట్లం, వెలుగు : అంతర్రాష్ట సలాబత్ పూర్​ రవాణా శాఖ చెక్​పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆఫీసులో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో విస్తుబోయే విషయాలు బయటకు వచ్చాయి. చెక్​పోస్టులో ఏఎంవీఐ కవిత, కానిస్టేబుల్ మోహిన్​ నిద్రిస్తుంటే ప్రైవేటు వ్యక్తులే ఆఫీసు నిర్వహిస్తూ లారీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వారి వద్ద నుంచి లెక్కల్లో లేనివి రూ. 91వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శేఖర్​ గౌడ్​ మాట్లాడుతూ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు జరగడం గమనార్హం.