
- ప్రైవేటు వ్యక్తులే ఆఫీసు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు
- వారి వద్ద నుంచి రూ. 91 000 స్వాధీనం
పిట్లం, వెలుగు : అంతర్రాష్ట సలాబత్ పూర్ రవాణా శాఖ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆఫీసులో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో విస్తుబోయే విషయాలు బయటకు వచ్చాయి. చెక్పోస్టులో ఏఎంవీఐ కవిత, కానిస్టేబుల్ మోహిన్ నిద్రిస్తుంటే ప్రైవేటు వ్యక్తులే ఆఫీసు నిర్వహిస్తూ లారీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వారి వద్ద నుంచి లెక్కల్లో లేనివి రూ. 91వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత చెక్పోస్టుపై ఏసీబీ దాడులు జరగడం గమనార్హం.