నంద్యాల టీడీపీ అభ్యర్థికి యాక్సిడెంట్

నంద్యాల టీడీపీ అభ్యర్థికి యాక్సిడెంట్

నంద్యాల టీడీపీ అభ్యర్థికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్ ఎండీ ఫరూక్ నంద్యాల నుంచి కర్నూలుకు ప్రయాణిస్తుండగా పాన్యం మండలం కమ్మరాజుపల్లి దగ్గరకు రాగానే కారు బర్రెలను ఢీ కొట్టి బోల్తా పడింది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

ఈ ప్రమాదం ఫరూక్ తీవ్రంగా గాయపడ్డారు.  కారులో నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరిలించారు.