అయ్యో ఘోరం… కర్ణాటకలో ప్రైవేటు బస్సు – టాటాఏస్ ఢీ : 12 మంది మృతి

అయ్యో ఘోరం… కర్ణాటకలో ప్రైవేటు బస్సు – టాటాఏస్ ఢీ : 12 మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి మురమళ్ల  దగ్గర్లో ప్రైవేటు బస్, టాటా ఏస్ ప్యాసింజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ దారుణ ప్రమాదంలో టాటా ఏస్ లోని 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని సాక్షులు చెప్పారు.

ప్రమాదం జరిగిన స్థలంలో పరిస్థితి చూస్తుంటే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోంది. ప్రైవేటు బస్సు పూర్తిగా రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి … సరైన దారిలో వస్తున్న ఆటోను గుద్దింది. బస్సు ఢీకొట్టడంతో… ఆటో ముందుభాగం నుజ్జునుజ్జైపోయింది. ఆటోలోనివాళ్లు.. ఒకరిపై ఒకరు పడి గుద్దుకుని ప్రాణాలు కోల్పోయారు. కొందరి ముఖాలు కూడా గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. ప్రమాద స్థలంలో పరిస్థితి భయంగొలిపేలా ఉంది. బస్సు అత్యంత వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.

చనిపోయిన 12 మందిలో.. ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. చనిపోయిన వాళ్లంతా చింతామణి పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.