ఈజీఎస్​లో బినామీ దందా.. ఆడిట్​లో వెల్లడైన అక్రమాలు

ఈజీఎస్​లో బినామీ దందా..  ఆడిట్​లో వెల్లడైన అక్రమాలు

 నిర్మల్, వెలుగు: నిర్మల్ ​జిల్లాలోని సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో జరిగిన ఈజీఎస్ పనులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ జరిగిన పనుల్లో బినామీ వ్యక్తుల ప్రమేయంపై ఫిర్యాదులున్నాయి. ఈ మేరకు గ్రామంలో శనివారం సోషల్ ఆడిట్ ప్రజా వేదిక నిర్వహించారు. డీఆర్డీఓ పీడీతో పాటు ఎంపీపీ బర్ల మానస, జడ్పీటీసీ జీవన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అక్రమాలపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.  

ఈజీఎస్ కింద చేపట్టిన పశువుల షెడ్లు, పంట కల్లాలు ఇతర పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు.  తమ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుతో ఇతరులు పశువుల షెడ్లు, పంటకల్లాలను నిర్మించారని తెలిపారు. దీనిపై పీడీ స్పందిస్తూ విచారణ జరుపుతామని వారంలోపు డబ్బును రికవరీ చేస్తామని వెల్లడించారు.