చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన

చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ ..  బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన

చందుర్తి, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ నిందితుడు చందుర్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం గర్శకుర్తికి చెందిన ఓ నిందితుడు గంజాయి రవాణా చేస్తుండగా ఇదే మండలంలోని మరిగడ్డ శివారులో సీసీఎస్​పోలీసులు పట్టుకుని చందుర్తి పోలీసులకు అప్పగించారు. విచారణ తర్వాత రిమాండ్ కు పంపించేందుకు పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. 

సోమవారం అర్ధరాత్రి నిందితుడు టాయిలెట్​వస్తుందని చెప్పడంతో కానిస్టేబుల్ అతడిని బయటకు తీసుకువచ్చాడు. పక్కనే ప్రహరీ ఉండడంతో కానిస్టేబుల్​ చూసేంతలో గోడ దూకి పరారయ్యాడు. సదరు కానిస్టేబుల్​ఇతర సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఎస్సై, సీఐకి చెప్పారు. ఎస్​ఐ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలించినా ఫలితం లేకుండా పోయింది.  ఈ విషయమై చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్​ను వివరణ కోరగా నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.