
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనాతో ఆగిన ఈ మూవీ షూటింగ్ తిరిగి నిన్న ప్రారంభమైంది. చిరంజీవి కూడా షూట్లో జాయినయ్యారు. పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్గా జరిగే ఈ షెడ్యూల్తో సినిమా పూర్తి కానుంది. రామ్ చరణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డితో కలిసి తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దసరాకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.