వాచ్​మెన్​గా చేస్తూ 3 జాబ్​లు సాధించిండు

వాచ్​మెన్​గా చేస్తూ 3  జాబ్​లు సాధించిండు

సికింద్రాబాద్,వెలుగు: ఓ నిరుద్యోగి వాచ్ మెన్ గా చేస్తూనే మూడు సర్కార్ కొలువులు సాధించాడు. పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ఎంకా ఎంఈడీ చదివాడు. అతని తండ్రి పెద్దులు మేస్త్రీ పని చేస్తుండగా.. తల్లి పోశమ్మ బీడీ కార్మికురాలు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

ఎంఈడీ ఓయూ క్యాంపస్ లో చదువుతూనే ఖర్చుల కోసం ఈఎమ్మార్సీలో ఐదేళ్లుగా వాచ్ మెన్ గా చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అతని పట్టుదల, కష్టం ఫలించి.. ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.  ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ జాబ్ లు సాధించాడు. ఈఎమ్మార్సీ డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రవీణ్ ను సన్మానించారు.