మోడీ పాలనకు ఏడేండ్లు

మోడీ పాలనకు ఏడేండ్లు

లక్ష గ్రామాల్లో బీజేపీ సేవా కార్యక్రమాలు

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనకు ఏడేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మోడీకి బీజేపీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 
కరోనా కారణంగా.. వేడుకలకు బదులు ‘సేవా దివస్’ పేరుతో నేతలు ఆదివారం దేశమంతా కార్యక్రమాలు నిర్వహించారు. కోట్లాది మంది కార్యకర్తలు లక్ష గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సర్కారు ఏడేండ్ల పాలనను ప్రధాని మోడీ  ‘మన్​ కీ బాత్’లో ప్రస్తావించారు. ఈ కాలంలో తమ సర్కారు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను గుర్తుచేశారు. కరోనా విషయంలో ఇతర దేశాల ఒత్తిడితో కాకుండా, సొంత నిర్ణయాలతో ముందుకెళుతున్నట్లు వివరించారు. కరోనాపై దేశం  గెలుస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.