పోలీస్‌ స్టేషన్‌కు సైకిల్ పై వచ్చిన ఏసీపీ

పోలీస్‌ స్టేషన్‌కు సైకిల్ పై వచ్చిన ఏసీపీ

రాజాపేట, వెలుగు : యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి ఉదయం 7 గంటల కు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి రాజాపేట పోలీస్ స్టేషన్ వరకు (20 కిలోమీటర్లు) సైకిల్ వెళ్లారు. పోలీస్‌ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులు, రిజిష్టర్లు, పోలీసు సిబ్బంది హాజరును పరిశీలించారు. తిరిగి 20 కిలోమీటర్లు గుట్టకు అదే సైకిల్ పై వెళ్లారు. ఇలా ఏసీపీ వినూత్నంగా పోలీస్ స్టేషన్ కు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.