యాక్షన్‌‌ విత్ హ్యూమర్

యాక్షన్‌‌ విత్ హ్యూమర్

యాక్షన్ బ్యాక్‌‌డ్రాప్‌‌ సినిమాలంటే చిన్నప్పట్నుంచీ చాలా ఇష్టం.  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం చేస్తున్నప్పుడు ఏదో వెలితిగా అనిపించేది. కానీ కథ నాకు పర్సనల్‌‌గా నచ్చి చేశా.  ఫస్ట్ లాక్‌‌డౌన్‌‌లో ఆత్మ విమర్శ చేసుకున్నా. అప్పుడే సురేందర్ రెడ్డిని కలిశా. అప్పటికి కథ ఏమీ అనుకోలేదు. యాక్షన్ డ్రామా చేద్దామనుకున్నాం. తెలుగు ప్రేక్షకులకు నేను  దగ్గర కావాలంటే నానుంచి ఏదైనా  కొత్తదనం చూపించాలి. అందుకే స్పై జానర్ ఎంచుకున్నా. నా సినిమాకొస్తే ప్రేక్షకులు ఎక్స్‌‌ట్రీమ్ ఎక్స్‌‌పీరియెన్స్ పొందాలి. ప్రస్తుతం నాకున్న మైండ్ సెట్‌‌ ఇది. 


 ‘ఏజెంట్’ చాలా వైల్డ్‌‌గా ఉంటుంది. కథకు తగ్గట్టు నాలుగు నెలల్లో బాడీ బిల్డప్ చేసేయాలనుకున్నా. అది కాస్తా పది నెలలు పట్టింది. ఆ తర్వాతే ఫైనల్‌‌గా షూట్‌‌కి వెళ్లాం. నా క్యారెక్టర్ క్రేజీగా ఉంటుంది.  కోతిలా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. రిక్కి (రామకృష్ణ) పాత్రలో నేను కనిపిస్తా. కానీ వైల్డ్‌‌ ఏజెంట్ అని పిలుస్తారు. సీరియస్ యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా హ్యూమర్ తెచ్చే పాత్ర. నిజంగా నేను ఇంత ఎనర్జీ లెవెల్‌‌లో చేయగలనా లేదా అనిపించేది. సూరి గారి క్యారెక్టర్స్‌‌లో కొంత క్రాక్ ఉంటుంది. దానివల్ల సినిమాపై ఎక్సయిట్‌‌మెంట్ ఉంటుంది.  


 ‘ఏజెంట్‌‌’ కోసం కొత్త స్పై వరల్డ్‌‌ని క్రియేట్ చేశాడు సూరి. మమ్ముట్టి,  డినో మోరియో పాత్రలు సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయి. ముగ్గురి పాత్రల మధ్య జరిగే ఇంటెన్స్ డ్రామా ఇది. మమ్ముట్టి గారి పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆయనకు క్యారెక్టర్ నచ్చితేనే చేస్తారు. ఆర్డినరీ పాత్ర అయితే ఆయన ఒప్పుకోరు. ప్రతి సీన్‌‌ను సీరియస్‌‌గా తీసుకుని చేస్తారు. నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు.  సాక్షి వైద్య పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. మంచి ఎనర్జీతో చేసింది. రోల్ తక్కువ ఉన్నా.. తనదైన యాక్టింగ్‌‌తో ఇంప్రెస్ చేస్తుంది. 


 హిప్‌‌హాప్ తమిళ క్రేజీ మ్యూజిక్‌‌ ఇచ్చాడు. మోస్ట్ సపోర్టివ్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ దొరకడం అదృష్టం. నాకు మామూలుగా రిలీజ్ డేట్ సెంటిమెంట్స్ ఉండవు. కానీ పోకిరి,  బాహుబలి2 రిలీజ్‌‌ అయిన డేట్‌‌కే మా సినిమా వస్తుండడం హ్యాపీ. అవి రెండూ  నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్. జూన్‌‌లో కొత్త సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నా.
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్.  మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. 


నాన్నకు స్ర్కిప్ట్ మొత్తం తెలీదు. బిట్స్‌‌గా చెప్పాను అంతే. నా కథల విషయంలో నేనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అది నా బాధ్యతే. నాన్నను బ్లేమ్ చేయడం నాకిష్టం లేదు. ఆయన్ను సలహాలు అడుగుతాను కానీ.. ఈ స్ర్కిప్ట్ చేయనా, వద్దా అని మాత్రం అడగను. చైతూతో కూడా అంతే. ఈ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్‌‌కి చరణ్, ప్రభాస్ వస్తున్నారనే దానిలో నిజం లేదు. ట్రైలర్ పంపాను. చూసి బాగుందన్నారు.