మెడికల్​ టూరిజాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు

మెడికల్​ టూరిజాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు
  • హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మరింత బలోపేతం
  • త్వరలో హీల్​ ఇన్​ ఇండియా, హీల్​ బై ఇండియా పోర్టల్స్​
  • ఆగస్టు 15న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
  • ఫారినర్ల​కు ఇండియన్​ ట్రీట్​మెంట్​

న్యూఢిల్లీ: దేశంలో మెడికల్​ టూరిజాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘హీల్​ ఇన్​ ఇండియా’, ‘హీల్​ బై ఇండియా’ అనే రెండు కొత్త ప్రాజెక్టులను త్వరలో లాంచ్​ చేయబోతున్నది. ఆన్​లైన్​ పోర్టల్​ రూపంలో సాగే ఈ సేవల కోసం పలు మంత్రిత్వ శాఖల అధికారులు 36 గంటల పాటు 50 స్టేక్​ హోల్డర్స్​తో చర్చలు జరిపారు. వారి ప్రజెంటేషన్స్​ను అర్థం చేసుకున్నారు.  పోర్టల్​ ద్వారా కలిగే లాభాలతో పాటు ఎదురయ్యే సమస్యలపైనా  చర్చించారు. ఈ 2 పెద్ద ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. వన్​ స్టాప్​ టెక్​ హెవీ పోర్టల్​ అయిన ‘హీల్​ ఇన్​ ఇండియా’ ద్వారా మెడికల్​ టూరిజాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని నిర్ణయించింది. ఇక్కడ వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు మరింత అభివృద్ధి చెందేందుకు ‘హీల్​ బై ఇండియా’ ప్రాజెక్టును తీసుకొస్తున్నది. ఏ దేశానికైనా వెళ్లి వైద్య రంగంలో సేవ చేసే అవకాశం కల్పిస్తున్నది. 

హీల్​ ఇన్​ ఇండియా

ఇండియాలో మెరుగైన వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? ట్రీట్​మెంట్​ ఎలా ఉంటుంది? వంటి కీలక సమాచారంతో ‘హీల్​ ఇన్​ ఇండియా’ ఆన్​లైన్​ పోర్టల్​ను  కేంద్రం ప్రారంభించనుంది. ఫారినర్స్​ కోసం తెస్తున్న ఈ పోర్టల్​ డ్యాష్​ బోర్డులో ట్రీట్​మెంట్, ప్యాకేజీ, లోకేషన్స్​ కనిపిస్తాయి. అక్కడే వీసా, ట్రావెల్ టికెట్ బుకింగ్ చేసుకునే ఆప్షన్​ ఉండనుంది. ఈ పోర్టల్​ అందుబాటులోకి వస్తే.. దళారుల అవసరం ఉండదని, ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. మెడికల్​ టూరిజంలో భాగంగా 17 నగరాల్లో హెల్త్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ను అప్​గ్రేడ్​ చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. 

హీల్​ బై ఇండియా

ఇండియన్​ హెల్త్​కేర్​ వర్కర్ల కోసం ‘హీల్​బై ఇండియా’ అనే సెపరేట్​ పోర్టల్​ను కేంద్రం​ ప్రారంభించనుంది. విదేశాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలనుకునేవాళ్లకు  ఈ పోర్టల్​ ఉపయోగపడనుంది. ఫారిన్​లో అవకాశాల గురించిన పూర్తి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 42 అనుబంధ హెల్త్​ కేర్​ సర్వీసెస్​లను గుర్తించింది. పోర్టల్​ ద్వారా ఫారిన్​లో జాబ్​ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులను ఇవి గుర్తించి వారికి పూర్తి సమాచారం అందజేస్తుంది. ఇండియాను వరల్డ్స్​ బెస్ట్​ మెడికల్​ టూరిజం హబ్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వివరించారు. అన్ని అనుకున్నట్టు జరిగి.. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ‘హీల్​ ఇన్​ ఇండియా’, ‘హీల్​ బై ఇండియా’ పోర్టల్స్​ను ప్రారంభిస్తారని వివరించారు. పోర్టల్స్​ ఏర్పాటుపై మూడు రోజుల పాటు సాగిన మీటింగ్​లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏవియేషన్​,  ఆయూష్​ మంత్రిత్వ శాఖ,  టాప్​ హాస్పిటల్స్​ ప్రతినిధులు, టూరిజం, ఎంబసీ అధికారులు పాల్గొన్నారు.