నటి త్రిష(Trisha) వివాదం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఆమెపై నటుడు మన్సూర్ ఆలీఖాన్(Mansoor Alikhan) చేసిన కామెంట్స్ ను అన్ని ఇండస్ట్రీల పెద్దలు కండించారు. అందులో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ఉన్నారు. అయితే త్రిష వివాదంలో నటుడు చిరంజీవి చేసిన ట్వీట్ పై మన్సూర్ అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చిరంజీవిపై మన్సూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దానిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇంతకీ చిరంజీవి గురించి ఏం మాట్లాడారంటే.. చిరంజీవి ప్రతి సంవత్సరం హీరోయిన్స్ కి పార్టీలు చేసుకుంటారు. వాటికి నన్ను ఎప్పుడు పిలువలేదు. కేవలం హీరోయిన్స్ ను మాత్రమే పిలుస్తారు. అది ఆయన ఇష్టం కానీ.. నాకు సంబంధించిన వివాదంలో ఏం జరిగిందని ఒక కాల్ చేసి విషయం తెలుసుకున్నాక మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన మాట్లాడిన మాటలు నన్ను బాధించాయి.
#MansoorAliKhan Comments on #Chiranjeevi:
— Movies4u Official (@Movies4u_Officl) November 28, 2023
? Aayana Old Heroines tho Every Year Party Cheskuntadu.
? Okasari Naku Call Chesi Asal Em Jarigindhi ani Adagalsindi. pic.twitter.com/b44tLcpSmc
అలాగే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు కానీ.. పేద వాళ్ళకి ఎలాంటి సహాయం చేయలేదు. ఈ విషయంలో చిరంజీవి, కుష్బూ, త్రిష లపైన 20 కోట్లకు పరువు నష్టం దావా వేశాను, వచ్చిన డబ్బును మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోయిన కుంటుంబాలకు ఇస్తాను.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మన్సూర్ చేసిన ఈ కామెంట్స్ పై మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
చిరంజీవి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు మింగాడు కానీ పేద వాళ్ళకి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడు ఎవరిది వక్ర బుద్ధి.@KChiruTweets మీద 20 కోట్లకు పరువు నష్టం దావా వేసాను వచ్చిన డబ్బును మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను - మన్సూర్ ఆలీ
— Gopi Nath NBK (@Balayya_Garu) November 28, 2023
pic.twitter.com/t7hD0BspRI