మహాత్మగాంధీపై మరోసారి ట్వీట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఇండియన్ కరెన్సీ మీద… సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ , అబ్దుల్ కలాం, సావర్కార్ , వాజ్ పేయి లాంటి మహానుభావుల చిత్రాలు చూడాలని ఉందన్నారు. స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన నేతలను… జనం మర్చిపోకూడదని నాగబాబు ట్వీట్ చేశారు. గాంధీ బతికి ఉంటే తనతో పాటు…. దేశానికి సేవ చేసిన మహానుభావులను గౌరవించమని తప్పకుండా చెప్పేవారని నాగబాబు ట్వీట్ లో రాశారు. ఇటీవలే మహాత్మగాంధీని చంపిన గాడ్సేపై… నాగబాబు చేసిన ట్వీట్ వివాదమైంది. నాగబాబును సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ
తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి
పడిపోయిన టమాట రేటు
15 సంవత్సరాల జ్యోతి కుమారి గాయపడ్డ తన తండ్రిని సైకిల్ మీద కూర్చోపెట్టుకొని 1200 కిమి తొక్కుకుంటు 7 రోజుల ప్రయాణించి తన స్వగ్రామానికి చేరుకొంది.save the girl child and save yourself. pic.twitter.com/wHY6EiRKTI
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 23, 2020
గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020