కోదాడ ఎమ్మెల్యేను కలిసిన ఆర్.నారాయణమూర్తి

కోదాడ ఎమ్మెల్యేను కలిసిన ఆర్.నారాయణమూర్తి

నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను కోదాడలోని ఆయన క్యాంపు ఆఫీసులో కలిశారు. ఈ నెల 14న రిలీజ్ అయిన రైతన్న సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలిపేలా సినిమా తీసినట్లు తెలిపారు ఆర్ నారాయణమూర్తి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పండించిన పంట ద్వారా రైతు 50 శాతం లాభాలు పొందాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు  అమలు చేస్తే రాయితీలు, చట్టాలు అవసరం లేదన్నారు ఆర్. నారాయణమూర్తి.