తమిళనాడు పొలిటీషియన్, సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ కరోనా బారినపడ్డారు. ఆయన తనకు కరోనా సోకినట్లు.. రిపోర్ట్ తో సహా ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో ఫిబ్రవరి 1న టెస్ట్ చేయించుకున్నారు. ఆ పరీక్ష ఫలితాలు అదే రోజు రాత్రి 10 గంటలకు వచ్చాయి. ఆ ఫలితాల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.
Good evening my near and dear friends relatives and my brothers and sisters In the political party,this evening I have tested positive and have self isolated myself,I humbly request all the dear ones who have been in contact for the past week to test yourself immediately
— R Sarath Kumar (@realsarathkumar) February 1, 2022
శరత్ కుమార్ సినిమాల్లోకి రాకముందు బాడీ బిల్డర్ గాను, ఆ తర్వాత జర్నలిస్ట్ గాను పనిచేశారు. ఆయన 1986లో వచ్చిన ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు. శరత్ కుమార్ ఇప్పటివరకు 130కి సినిమాల్లో నటించారు. ఆయన తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించారు. శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అనే పార్టీని కూడా ప్రారంభించారు.