కనిపిస్తే చెప్పండి : డ్రగ్స్ కేసులోని నటి లిషిత మిస్సింగ్.. పోలీస్ కంప్లయింట్

కనిపిస్తే చెప్పండి : డ్రగ్స్ కేసులోని నటి లిషిత మిస్సింగ్.. పోలీస్ కంప్లయింట్

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో A8గా ఉన్న నటి లిషిత పరారీలో ఉన్నట్టు సమాచారం. లిషిత ఇంటికి మూడు రోజుల క్రితం నోటీసులు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అంటించారు. నోటీసులపై ఆమె సోదరి కుషిత లాయర్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చి రిప్లై ఇచ్చింది. లిషిత ఇంట్లో లేదని, వచ్చాక పంపిస్తామని దర్యాప్తు అధికారులకు తెలిపింది. 

డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లిషిత కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసు తెర పైకి  వచ్చినప్పటి నుండి లిషిత కనపడటం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. లిషిత ఎక్కడున్న విచారణకు ఖచ్చితంగా గచ్చిబౌలి పోలీసులు తేల్చి చెప్పారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అబ్బాస్ విచారణలో కీలక విషయాలు చెప్పినట్టు సమాచారం. 

ఫిబ్రవరి 24, 2024న రాడిసన్ హోటల్ లో డ్రగ్ పార్టీ జరిగిందని ఈ పార్టీలో శ్వేత, లిషీ, నీల్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని అబ్బాస్ వెల్లడించాడని సమాచారం. వారికి సప్లై చేసిన డ్రగ్స్ ను మీర్జా వహీద్ బేగ్ నుంచి కొనుగోలు చేశానని, అవి వివేకా డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి అందజేస్తున్నానని అబ్బాస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వాట్సప్ చాటింగ్ కూడా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం.