హైదరాబాద్, వెలుగు: మొబైల్ రిటైల్ చైన్ సెల్బే నిజామాబాద్లో తన కొత్త షోరూమ్ను ఏర్పాటు చేసింది. టాలీవుడ్ నటి శ్రీముఖి బుధవారం ఈ షోరూమ్ను ప్రారంభించారు. టైర్ 2 టౌన్లో సెల్బే షోరూమ్ ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ షోరూమ్లో మొబైల్ ఫోన్లు, యాక్ససరీలు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి.
నిజామాబాద్ , చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ సెల్బే షోరూమ్ని సందర్శించి వారికి ఇష్టమైన మొబైల్ హ్యాండ్సెట్, స్మార్ట్ టీవీ లేదా ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని, ప్రారంభ ఆఫర్లను పొందాలని శ్రీముఖి కోరారు. సెల్బేలో ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 7,999 నుంచి మొదలవుతోంది. ఐఫోన్ను రూ. 2,705 ఈఎంఐ కే అమ్ముతోంది.
ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై ఒక కచ్చితమైన బహుమతి, అదే విధంగా రూ.15,000 కంటే ఎక్కువ విలువైన స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.2,499 విలువైన బ్రాండెడ్ ఇయర్ బడ్స్ను ఫ్రీగా ఇస్తోంది. సెల్బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు మాట్లాడుతూ, అర్హతగల కస్టమర్లు మొబైల్ హ్యాండ్సెట్లు, టీవీలు, ల్యాప్టాప్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఆప్షన్లను పొందవచ్చని చెప్పారు.