ముంబై: అదానీ గ్రూప్ తన ఎఫ్పీఓను కాన్సిల్ చేసుకున్న ఎఫెక్ట్ మన దేశపు ఇమేజ్ మీద ఏమీ పడలేదని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. కిందటి రెండు రోజులలోనే మన ఫారెక్స్ రిజర్వులు 8 బిలియన్ డాలర్ల మేర పెరిగాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ ఎపిసోడ్ వల్ల మన దేశపు మాక్రో ఎకనమిక్ ఫండమెంటల్స్, ఎకానమీ ఇమేజ్పై ఎలాంటి ప్రభావమూ పడలేదని వెల్లడించారు. యూఎస్ షార్ట్ సెల్లర్ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్పీఓ డబ్బు రూ. 20 వేల కోట్లను ఇన్వెస్టర్లకు వాపసు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎఫ్పీఓలు వస్తూనే ఉంటాయి....ఎఫ్ఐఐలు బయటకు వెళ్తూనే ఉంటాయని మీడియాతో నిర్మలా సీతారామన్ అన్నారు. అన్ని మార్కెట్లలోనూ హెచ్చు–తగ్గులు ఉంటాయని, కానీ రెండు రోజులలో పెరిగిన ఫారెక్స్ రిజర్వులు మన ఎకానమీ పటిష్టంగా ఉందనేది తెలియజేస్తాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణల గురించిన ప్రశ్నకు, దేశంలోని ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్లు ఇండిపెండెంట్గా తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. మార్కెట్లలో స్టెబిలిటీ తెచ్చేందుకు అవసరమైన అన్ని అధికారాలూ సెబీకి ఉన్నాయని చెప్పారు. అదానీ గ్రూప్ అప్పులపై ఆర్బీఐ ఇప్పటికే ఇచ్చిన వివరణనూ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అదానీ కాంట్రావర్సీ టీ కప్పులో తుపాను లాంటిదనే తన కామెంట్కు కట్టుబడి ఉన్నట్లు ఫైనాన్స్ సెక్రటరీ టీ వీ సోమనాథన్ చెప్పారు. మాక్రో ఎకనమిక్ కోణంలో మాత్రమే తాను ఆ కామెంట్ చేశానని వివరణ ఇచ్చారు.
పాత ట్యాక్స్ పద్ధతి కొనసాగుతుంది....
పాత ట్యాక్స్ పద్ధతి నిలిపి వేయాలనే నిర్ణయమేదీ తీసుకోలేదని, సులభంగా ఉండటంతోపాటు కొన్ని ఇన్సెంటివ్స్, తక్కువ రేట్లతో కొత్త పద్ధతి తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్త పద్ధతి వల్ల సేవింగ్స్ తగ్గుతాయనే విమర్శలను ప్రభుత్వాధికారులు తిరస్కరించారు. బడ్జెట్ తర్వాత ముంబైలో జరిగిన ఒక మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ సహా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.